దర్శి (ప్రకాశం జిల్లా):– గత ఐదు రోజులుగా భానుడి ప్రచండ ప్రతాపంతో అల్లాడిపోయిన దర్శి మండల ప్రజలకు, రైతాంగానికి శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం తీవ్ర ఊరటనిచ్చింది. ఉదయం 9 గంటల నుంచే సెగలు రేపుతూ అగ్నిగుండంగా మారిన ఎండల వల్ల రోజువారీ పనులకు వెళ్లలేక, నిత్యావసర సరుకులు తెచ్చుకోలేక స్థానికులు, వ్యవసాయ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.Prakasam district news :దర్శిలో ఘనంగా ఆరో రోజు వినాయక చవితి వేడుకలు — 56 వేల నోట్ల దండతో లంబోదరుడికి ప్రత్యేక అలంకరణ
రోడ్లు జలమయం – కూలిన పందిళ్ళు: దిడగాల్స్ కురిసిన వర్షానికి మండలంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈ అకస్మాత్తు వర్షం, గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న పందిళ్లు నేలమట్టమయ్యాయి.
రైతులు, పాడి రైతుల హర్షం: గత కొన్ని నెలలుగా వర్షాలు లేక పంటలు ఎండుముఖం పట్టడమే కాకుండా, పశుగ్రాసం దొరక్క పాడి దిగుబడి పూర్తిగా పడిపోయిందని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ వర్షంతో మెట్ట పంటలకు జీవం పోసినట్లయిందని, ఎండుతున్న పశుగ్రాసం మళ్లీ పచ్చబడి పశువుల మేతకు అనువుగా మారుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇకపై పాడి దిగుబడి కూడా పెరుగుతుందని యజమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



